షాకింగ్: 'బాబుపై మోడీకి ఆ కక్ష, ఇలా తీర్చుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టులకు మరో రూపం'
Recommended Video

చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఐ నేత నారాయణ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనను దుయ్యబట్టడంతో పాటు నవ్యాంధ్ర ప్రదేశ్కు కేంద్రం సహకారం లేకపోవడంపై ఆయన ఆసక్తికర, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షనిస్టులకు మరో రూపం మోడీ అని తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి విభజన సమయంలో హామీల కోసం అందరు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

బాబు, మోడీలకు పాత కక్షలు
ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాత కక్షలు ఉన్నాయని, ఆ కక్షను ప్రధాని ఇప్పుడు ఏపీ ప్రజల పైన తీర్చుకుంటున్నారని నారాయణ ఘాటుగా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, హోదా మాత్రమే కావాలని కుండబద్దలు కొట్టారు.

దానిని ఉద్దేశించే అన్నారా
కాగా, గతంలో గోద్రా అల్లర్ల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నాడు గుజరాత్ సిఎంగా ఉన్న మోడీపై విమర్శలు చేశారు. దీనిని ఉద్దేశించే నారాయణ ఇలా వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు.

బాబు అఖిల సంఘంతో కలవడంపై షరతు
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం కోసం అఖిల సంఘాల భేటీ వేస్తామని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అంశం పైన కూడా నారాయణ స్పందించారు. తాము ప్రత్యేక హోదా కోసం పోరాడేటట్టు అయితేనే అఖిలపక్షంతో కలుస్తామని, లేదంటే కలిసేది లేదన్నారు.

టీడీపీ నిలదీయడంలో తప్పు లేదు
విభజన హామీలు అమలు చేయలేదంటూ టీడీపీ చేపడుతున్న నిరసనలను ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమర్థించారు. డిమాండ్లను నెరవేర్చాలని అడగడంలో తప్పు లేదన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ అవశిష్టంగా మిగిలిపోయిందని, ఏపీకి ఎన్నో చేస్తామని చెప్పారని, కానీ అవేమీ నెరవేరలేదని, ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నిలదీయడంలో తప్పు లేదన్నారు.

బిగ్గరగా అడిగారు
ఇంకా చెప్పాలంటే ఎంపీలు బిగ్గరగా, స్పష్టంగా అడిగారని అశోక్ అన్నారు. సున్నితమైన ఈ అంశాలపై నాయకులను నిర్ణయం తీసుకోనివ్వాలని, తాము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నామని, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పారు. యూపీఏ సమయంలో అశాస్త్రీయంగా, హడావుడిగా రాష్ట్రాన్ని విభజించారనీ, అందుకే ఇప్పుడు సమస్యలు తలెత్తాయన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications