పీకేసేవారు: కిరణ్పై దాడి నిప్పులు, బాబు యాత్ర పైనా

ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరు రాజీనామాలు ఇచ్చినా వాటిని ఆమోదించే పరిస్థితి లేదన్నారు. ఇదంతా ఓ డ్రామా అన్నారు. జివోఎం ఏర్పాటు, చర్చలు, తెలంగాణ ప్రక్రియ కొనసాగింపు అన్ని జరిగిపోతున్నాయని అయినా ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా కిరణ్ అధిష్టానానికి వ్యతిరేకమైతే ఎప్పుడో పీకేసే వారన్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ మట్టికొట్టుకుపోతుందనే ఉద్దేశ్యంతో కొత్త పార్టీ పెట్టడానికి సిఎం సిద్ధమవుతున్నారని, సమైక్యాంధ్రకు అనుకూలంగా పార్టీ పెట్టి సీట్లు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా సోనియా గాంధీ కుమ్మక్కులో భాగమేనన్నారు.
తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సమావేశాల్లో అవిశ్వాసం పెట్టగలరా అని సవాల్ చేశారు. బాబు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్ర ఎవరికోసమన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామన్నారు. అన్ని పార్టీలు సీమాంధ్ర ఉద్యమంలోకి రావాలన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి రావాలన్నారు.
బాబు, కిరణ్ల అండతోనే: భూమన
చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల అండతోనే సోనియా విభజనకు మొగ్గుచూపారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. విభజనకు అనుకూలంగా ఢిల్లీలో బాబు దీక్ష చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సమైక్యతకు విఘాతం కలిగించింది వారిద్దరే అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications