తప్పు చేశా, వాళ్లు తప్పులు చేసి బురద చల్లారు: దాసరి
హైదరాబాద్: రాజకీయాల్లో చేరినందుకు ప్రముఖ తెలుగు సినీ దర్శక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమలో దర్శకరత్నగా వెలుగొందుతూ రాజకీయాలలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని ఆయన అన్నారు. రాజకీయాలలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనపై బురద చల్లారని ఆయన అన్నారు.
సోమవారం సాయంత్రం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన దాసరి 71వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తన మనస్సులోని మాటను బయటపెట్టారు.

రాజకీయాలలో తప్పులు జరుగుతూనే వుంటాయి కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనపై నిందలు వేశారని ఆయన అన్నారు. అది బురదే కదా కడుగేసుకుంటే పోతుందని అనుకున్నాను కానీ అది బురదకాదు తారు అని గమనించాను అయినా కడుక్కున్నానని అన్నారు.
ఎవరినో కాపాడటానికి తనను బలిపశువుగా వాడుకున్నారని, నిందలు కలకాలం వుండవని దాసరి అన్నారు. తానేమిటో నిరూపించుకునే రోజు అతి త్వరలోనే వస్తుందని, తనపై పడిన మచ్చను కడుక్కుంటానని తన సత్తా చూపిస్తానని దాసరి నారాయణరావు అన్నారు. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.
బొగ్గు కుంభకోణం కేసులో దాసరి నారాయణ రావు ఇరుకున్న విషయం తెలిసిందే. యుపిఎ ప్రభుత్వ హయాంలో సహాయ మంత్రిగా పనిచేసిన ఆయనను ఆ కుంభకోణం చుట్టుముట్టింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించారు.
-
ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన కాయదు లోహర్! -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
OTT: దుమ్ములేపుతున్న కొత్త మూవీస్, ఈ వారం ఫుల్ లిస్ట్ ఇదే! -
క్షమించండి.. మళ్లీ నోరు జారను !! -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ -
రాజేంద్ర ప్రసాద్కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !!












Click it and Unblock the Notifications