వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం: జోస్యం చెప్పిన రోజా
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు చమరగీతం పాడతారని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. ఒంగోలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించారు.
ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. ఒంగోలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు చమరగీతం పాడతారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు నాయుడు పాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అజెండాను, తెలుగుదేశం పార్టీ జెండాను భూస్థాపితం చేసే సమయం దగ్గరపడిందని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications