పవన్ రాకపై దేవినేని, సీట్లమ్ముకుంటున్నారని జగన్పైన

హైదరాబాదులో జగన్ సమైక్య శంఖారావం 10 జన్పథ్ మెప్పు పొందేందుకే అన్నారు. నర్సాపురం, విజయవాడ టిక్కెట్లను రూ.50 కోట్ల నుండి వంద కోట్ల వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బేరం పెట్టిందని ఆరోపించారు. టిడిపి విభజన బిల్లును అడ్డుకుంటుందన్నారు.
వైయస్ జగన్ సమైక్యం ముసుగులో విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్ ఎంపీ సీట్లను అమ్ముకుంటున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పల్లెత్తు మాట అన్నా జగన్ సహించరని ఎద్దేవా చేశారు. అందుకు ఆ పార్టీ నేత దాడి వీరభద్ర రావుకు క్లాస్ పీకడమే నిదర్శనం అన్నారు.
తెలంగాణలో జెండా ఎత్తేసిన జగన్ సమైక్య రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications