వద్దని బొత్సపై దేవినేని, అంతా సీఎంలని కేసీఆర్పై సర్వే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అద్యక్షులు బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించబోమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
రాజధానిని ఇంకా ఎంపిక చేయకుండానే ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాజధానిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఎవరికో అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే తత్వం చంద్రబాబుది కాదన్నారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసి కాంగ్రెసు పార్టీయే ప్రజలకు తీర అన్యాయం చేసిందన్నారు.
ఆ కుటుంబంలో అందరు సీఎంలే: సర్వే

కేసీఆర్ కుటుంబంలో అందరు ముఖ్యమంత్రులేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సిద్దిపేటలో అన్నారు. కూతురు, కొడుకు, మేనల్లుడుల కనుసన్నుల్లోనే పాలన సాగుతోందన్నారు.
అధికారంలోకి వచ్చాక తెరాస ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు అయినా మంజూరు చేసిందా అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సాగుకు ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తే.. తెరాస కనీసం అయిదు గంటలు కూడా ఇవ్వడం లేదని శ్రీధర్ బాబు అన్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications