ఎన్నికలకు ముందు టీడీపీకి మరో తలనొప్పి
ఎన్నికలు దగ్గర పడుతున్న కూటమిలో ఇంకా అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా టీడీపీ నేతల మధ్య అధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది.ఇప్పటికే టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార వైసీపీలో చేరారు. నేతల మధ్య అధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. తాజాగా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఉదయగిరి టీడీపీ టికెట్ కాకర్ల సురేష్కు కేటాయించారు.
అయితే కాకర్ల సురేష్ ఒంటెద్దు పోకడలపై ఉదయగిరి సీనియర్ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకర్ల దురుసు ప్రవర్తనకు నొచ్చుకొని కొందరు నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు కంభం విజయరామి రెడ్డి మొదలగు టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదంతా గమనిస్తున్న ఉదయగిరి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ కాకర్ల సురేష్ వ్యవహార శైలిపై జిల్లా నాయకులకు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.

కాకర్ల సురేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మాజీ ఎమ్మెల్యేల అనుచరులు సమావేశం ఏర్పాటు చేశారు.నామినేషన్కు మాకు కనీస సమాచారం ఇవ్వలేదని.. నామినేషన్ కార్యక్రమానికి కూడా ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు.ఎన్నికల ప్రచారానికి మమ్మల్ని దూరం పెట్టారని కార్యకర్తలు వాపోతున్నారు.ఉదయగిరి టీడీపీ కార్యకర్తలు తాజాగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బొల్లినేని, మేకపాటి చంద్రశేఖర్ , విజయరామిరెడ్డి పాల్గొన్నారు.
ఇదే సమయంలో వైసీపీ వర్గ విభేదాలు పక్కన పెట్టీ కీలక నాయకులు కార్యకర్తలు ఏక తాటిపై వచ్చి ప్రచారంలో దూసుకుపోతుంటే, టీడీపీ మాత్రం వందలకోట్లు ఖర్చు చేస్తాడు అనే పేరుతో కాకర్ల సురేష్కు టికెట్ ఇవ్వగా తన పోకడలతో తనే ఒక సుప్రీంలా వ్వవహరిస్తూ పార్టీ నాయకులను దూరం చేసుకుంటూ గెలుపు అవకాశాలను సన్నగిల్లేలా వ్యవహరిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications