బిజెపిలోకి దినేష్రెడ్డి, టిక్కెట్: తెరాసలోకి బాబు మోహన్

బిజెపి, టిడిపిల మధ్య పొత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఒంగోలు లోకసభ అభ్యర్థిగా టిడిపి ఇప్పటి వరకు ఎవరిని ప్రకటించ లేదు. దీంతో టిడిపి హామీతో బిజెపి తరఫున పోటీ చేయాలని దినేష్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు.
ఇందుకు సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో ఫోన్లో మాట్లాడారని, అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్తానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు నుండి పోటీకి బిజెపి నేతల నుండి స్పష్టమైన హామీ రాగానే ఆయన అధికారికంగా ఆ పార్టీలో చేరే అవకాశముంది.
తెరాసలోకి బాబు మోహన్
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బాబు మోహన్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ మేరకు తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఈ రోజు సాయంత్రం భేటీ కానున్నారు. ఈ నెల 26న అధికారికంగా సైకిల్ దిగి కారెక్కనున్నారని తెలుస్తోంది. అతనికి కెసిఆర్ ఆందోల్ టిక్కెట్ కేటాయించనున్నారు. మరోవైపు జగన్కు షాకిస్తూ తెరాసలో చేరనున్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి నిర్మల్ లేదా నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఇచ్చే అవకాశముంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications