వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పాలమూరు నుండి రాహుల్ పోటీ చేయాలని అడిగాం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించాలని తాము కోరినట్లు సమాచార శాఖ మంత్రి డికె అరుణ మంగళవారం చెప్పారు. డికె అరుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అనుగుణంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత తమ ప్రాంత ప్రజల్లో కాంగ్రెసు పట్ల విశ్వాసం పెరిగిందని, దీనిని తాము డిగ్గీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

అలాగే తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నిర్వహిస్తున్న జైత్రయాత్రలను ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెసు పట్ల, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు కాంగ్రెసు పార్టీని అభినందిస్తున్నారన్నారు.

రాహుల్ గాంధీని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయించాల్సిందిగా తాము దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు చెప్పారు.

English summary
Minister DK Aruna on Tuesday met AP Congress Party incharge Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X