కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యక్ష రాజకీయాలకు డిఎల్ రవీంద్రా రెడ్డి గుడ్‌బై

By Pratap
|
Google Oneindia TeluguNews

 DL Ravindra Reddy to quit politics
కడప: ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే, కార్యకర్తలు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలని పట్టుబడుతున్నారు. చాలా కాలంగా ఆయన రాజకీయాల పట్ల నిరాసక్తంగా ఉన్నారు. ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తెలుసుకున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సంభవించిన తాజా రాజకీయ పరిణామాలు కూడా ఆయన రాజకీయాల పట్ల విరక్తి పెంచుకోవడానికి కారణమని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరుపడ్డారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన పోరాటం చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన చేరారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన విభేదాలు పొడసూపాయి.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చురుగ్గా పని చేయడం లేదు. కడప జిల్లాలో ఆయన ప్రధాన నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు.

English summary

 Former minister and Congress MLA DL Ravindra Reddy has decided to politics. He hails from Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X