మనషులుగా బతకండి- టీడీపీ నేతలకు రాధిక హితవు: మీ వీపు వెనుక ఏం జరుగుతుందో మీకు తెలుసా?
అమరావతి: అనకాపల్లి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు అనకాపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
I condemn below the belt hitting , labelling women, objectifying and being unparliamentary, an ex minister #bandarasatyanarayana has no qualms with his language and attitude. I stand for minister /actor amd good friend @RojaSelvamaniRK #women #harassment #politics pic.twitter.com/nmGHyeLgi2
— Radikaa Sarathkumar (@realradikaa) October 6, 2023
పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై బండారు సత్యనారాయణ అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. బెయిల్పై విడుదల అయ్యారు. బండారు సత్యనారాయణపై రోజాపై చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ భగ్గుమంటోంది.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మహిళపై బండారు సత్యనారాయణ అనే ఒకడు రోజాపై ఆరోపణలు చేస్తోంటే ఇంతకన్నా స్త్రీలని అవమానించడం ఇంకేముంటుందంటూ మండిపడ్డారు. బండారుపై అటు ప్రముఖ నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజాగా తమిళనాడుకే చెందిన నటి రాధిక శరత్కుమార్ సైతం బండారు సత్యనారాయణపై నిప్పులు చెరిగారు. ఓ సెల్ఫీ వీడియోను ఆమె తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మనుషులుగా బతకండి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు హితబోధ చేశారు. సభలు, సమావేశాలు, రాజకీయాలు చేయడానికి టీడీపీ నాయకులు బయటికి వెళ్లినప్పుడు వాళ్ల ఇళ్లల్లో ఏం జరుగుతుందో వాళ్లకి తెలుసా? అంటూ నిలదీశారు.
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదించుకున్న ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అదే మహిళలను కించపరచడం ఏ మాత్రం సహించరానిదని, వాళ్లు చేసిన తప్పును క్షమించడం కూడా సరికాదని అన్నారు.

ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ మహిళ, గృహిణిగా, బాధ్యత గల మంత్రిగా రోజాపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సభ్య సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని రాధిక శరత్ కుమార్ పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలనీ అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications