వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబుల్ గేమ్: జగన్‌ను కలిసిన తర్వాతే రిజైన్ అని సబ్బం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీని వీడుతానని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అలా చెబుతూ ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతు తెలుపుతూ కూడా కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు. వైయస్ జగన్‌ను కలిసిన తర్వాత తాను కాంగ్రెసుకు రాజీనామా చేస్తానని ఆయన శనివారంనాడు చెప్పారు.

పార్లమెంటు సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ మీరా కుమార్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల లోగా రాజీనామాలను ఆమోదిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

సమైక్య రాష్ట్రం కోసం రెండు నెలలుగా ఉద్యమిస్తున్న ప్రజల్లోనే ఉండి కేంద్రం మెడలు వంచుతామని ఆయన అన్నారు. రెండు రోజుల్లో తాను జగన్‌ను కలుస్తానని, జగన్‌తో చర్చించిన తర్వాత కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.

రాజీనామాలకు ఇది సరైన సమయం కాకున్నా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమించడానికి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తాము పట్టడం లేదని ఆయన అన్నారు. మరో ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

English summary
Congress MP Sabbam hari said that he will resign to Congress party after meeting YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X