రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం...60 పూరిళ్లు దగ్ధం;భారీగా ఆస్థి నష్టం
తూర్పుగోదావరి:రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.
తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేసేలోగానే పూరిళ్లు కావడంతో దగ్థమైపోయాయి. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకున్నా భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ చోటుచేసుకున్న కారణంగానే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు.

More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications