ఏపీలో మరో ఉపఎన్నిక-ఈసీ నోటిఫికేషన్ విడుదల..!
ఏపీలో మరో ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని శాసనమండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల, టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పుడు మరో స్ధానంలో జరగాల్సిన ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో ఈ ఉపఎన్నికల జరగబోతోంది.
రాష్ట్రంలో గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ హఠాన్మరణం కారణంగా ఈ స్ధానం ఖాళీగా ఉంది. దీంతో ఈ ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి జరిగే ఉపఎన్నిక కోసం ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.

అనంతరం ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 21 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 5న గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం విడుదల చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుందని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టీచర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై వారు ఇందులో తీర్పు ఇవ్వబోతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications