మిథున్ రెడ్డికి పిలుపు, మారుతున్న ఢిల్లీ లెక్కలు..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి పార్టీలు 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా జిల్లాల యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారుతోంది. లిక్కర్ కేసులో ఈడీ విచారణ మొదలైంది. సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. కాగా, ఇప్పుడు మిథున్ రెడ్డి విషయం లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
వైసీసీలోని ముఖ్య నేతలకు కేసుల్లో ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో సెట్ విచారణకు హాజరైన విజయ సాయిరెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఈ కేసులో రాజ్ కెసిరెడ్డిని సూత్రధారిగా పేర్కొంటూ ఆరోపణలు చేశారు.

మద్యం విధానం అమలులో తాను నేరుగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, అమ్మకాలతో తనకు సంబంధం లేదని గతంలో సిట్ ముందు స్పష్టం చేస్తూనే.. తాను దర్యాప్తుగా సహకరిస్తానని విజయ సాయిరెడ్డి తేల్చి చెప్పారు. కాగా, ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు సిట్ మొత్తం 16 మందిని అరెస్టు చేసింది. మొత్తం 48 మందిపై కేసులు నమోదయ్యాయి. మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
కాగా, ఈ మద్యం కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇక.. ఇదే కేసులో అరెస్ట్ అయి బెయిల్ పైన విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డికి సైతం తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సూచించింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
అసలు తనకు ఈ కేసుతో సంబంధం లేదని మిథున్ రెడ్డి చెబుతున్నారు. కాగా.. తాజాగా విజయ సాయి రెడ్డి పరోక్షంగా జగన్ కోటరీని ప్రస్తావిస్తూ.. వెనిజులా లో చోటు చేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగానే సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసారనే చర్చ సాగుతోంది. ఇక.. లిక్కర్ కేసులో ఏపీ కేంద్రంగా కొంత వేగం తగ్గిన సమయంలో.. ఇప్పుడు ఈడీ నోటీసులు.. విచారణ ఈ కేసులో కీలక మలుపుగా మారుతోంది. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications