బాబు రికార్డ్లు, రివర్స్: కేసీఆర్ రికార్డ్లు మావద్ద, దమ్ముంటే రావాలని ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, ఆ ఫోన్ రికార్డులను తాము నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు గురువారం అన్నారు.
వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి రూ.20 కోట్ల ఆఫర్ చేశాడని, అందుకు ఆధారాలున్నాయని చెప్పారు. టీడీపీ నుండి తెరాసలోకి వెళ్లిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. కేసీఆర్ డబ్బులిస్తేనే పార్టీలోకి వెళ్లానని చెప్పారన్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడాటని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. నాయిని బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు.
చంద్రబాబు చేసిన ఫోన్ల సమాచారం తమ దగ్గర ఉందని, కేసులు పెడతామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంటున్నారని, మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని, అయితే కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు చేసిన ఫోన్లపై విచారణ చేసే దమ్ము తెరాస ప్రభుత్వానికి ఉందా? ఉంటే ముందుకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసుపై పెద్ద గందరగోళం జరిగిన తర్వాత కూడా, తెరాస నేతలు టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఫోన్లు చేసి తమ పార్టీలోకి రావాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారని, ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలు రావుల చంద్రశేఖర రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రాజారాం యాదవ్, పీ రాములు గురువారం విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా కేసీఆర్ టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి నాలుగైదు గంటలు కూర్చుని, వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని, ఒక ముఖ్యమంత్రి ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అది రాజకీయ అవినీతి కాదా? తెరాసకు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి 85 ఓట్లు ఎలా పడ్డాయి? దానికి సూత్రధారి ఎవరు? వీటిపై విచారణ జరపవద్దా? టీడీపీ నుంచి తెరాసలోకి వెళ్లిన ఒక ఎమ్మెల్యే తనకు రూ.250 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని బహిరంగంగా చెప్పారని ఆరోపించారు.
ఒప్పుకొంటే పనులు ప్యాకేజీలు లేకపోతే పోలీసులా? చంద్రబాబుతోపాటు వీటన్నింటిపైనా విచారణ చేద్దామని సవాల్ చేశారు. చేతనైతే రావాలన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై తాము ఎవరికీ ఏ సీడీలూ ఇవ్వలేదని ఏసీబీ అధికారులు చెబుతుంటే, తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలూ ఉన్నాయని హోం మంత్రి చెబుతున్నారని విమర్శించారు.
ఎవరుపడితే వాళ్లు ఫోన్లు ట్యాప్ చేస్తారా? దీనికేమీ చట్టాలు లేవా? ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఎవరికి ఫోన్లు చేసినా అవి వినపడవని, ప్రత్యర్థి పార్టీల ఫోన్లు మాత్రం వినపడతాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో తాము తప్ప మరొకరు ఉండకూడని రాజకీయ శూన్యత సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications