కొడుక్కి అప్పనంగా సొమ్ము, బాబు కాదంటారా: కెసిఆర్పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టీఆర్ఎస్ నేతలు అకారణంగా టార్గెట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే అని దుయ్యబట్టారు.
మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. బహిరంగ సభలో ఎన్నికల మేనిఫెస్టోపై ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్ పేరుతో కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్కు రాష్ట్ర సొమ్మును అప్పనంగా కట్టబెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తాన్న కేసీఆర్ మాటతప్పారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను పరిస్థితి లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ సాధించడానికి చంద్రబాబే కారణమని, అటువంటి చంద్రబాబుపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ను ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. కేసీఆర్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎర్రబెల్లి అన్నారు.
ఇదిలావుంటే, నిరుద్యోగ యువతకు అన్యాయం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు.
లక్షల మంది పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల మందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి, ఆ వ్యవస్థను రద్దు చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఉన్నారని విమర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications