వచ్చే సంవత్సరం నుండే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలు : హైలెవల్ కమిటి
వచ్చే సంవత్సరం నుండే ఆర్ధికంగా వెనకబడిన ఉన్నతవర్గాలకు విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ అధికారులు ముమ్మరం చేశారు. రిజర్వేషన్ల అమలు పై చర్చించేందుకు హైలేవల్ కమిటి నేడు సమావేశం అయింది. దీని సాధ్యసాధ్యాలపై చర్చించింది.ఇందులోభాగంగానే రానున్న విద్యా సంవత్సరం నుండే రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

కాగా మొత్తం పదిశాతంలో రిజర్వేషన్లను 5శాతం కాపులకు మరో 5శాతాన్ని ఆర్ధికంగా వెనకబడిన ఉన్నత వర్గాలకు ఈరిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించారు. కాగా వచ్చే విద్యాసంత్సరం నుండే వీటీని వర్తింపచేయడంతోపాటు ఉద్యోగ అవకాశాలను కూడ రానున్న నోటిఫికేషన్లో పేర్కోవాలని నిర్ణయించారు. హైలెవల్ కమిటి వీటికి సంబంధించి రోస్టర్ పాయింట్స్తో పాటు నివేదికను చీఫ్ సెక్రటరీకి అందించనుంది. సీఎస్ అధ్వర్యంలో మరోసారి సమావేశంలో చర్చించిన అనంతరం ప్రభుత్వం దీనిపై జీవో జారీ చేయనుంది.












Click it and Unblock the Notifications