నకిలీ నోట్ల పంపిణీ ముఠా నేత ఎల్లంగౌడ్ అరెస్టు
షామీర్పేట వద్ద జరిగిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్తో పాటు ఎల్లంగౌడ్ అనుచరుడు మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో కాల్పులు జరిపి పారిపోయిన ఎల్లంగౌడ్ కోసం పోలీసులు అప్పటి నుంచి గాలింపు జరుపుతూనే ఉన్నారు. మహారాష్ట్రలో ఎల్లంగౌడ్మ ఎస్ఓటి అదుపులోకి తీసుకుంది.
నలుగురు ముఠా సభ్యులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు ఈ నెల ప్రారంభంలో చుట్టుముట్టారు. ఈ సమయంలో ఎల్లంగౌడ్ ముఠా కాల్పులు జరపడంతో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మరణించాడు. ఎస్సై వెంకట్ రెడ్డి గాయపడ్డాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపాడు. ఈ ఎదురు కాల్పుల్లో ఎల్లంగౌడ్ అనుచరుడు కూడా మృతి చెందాడు.
మజీద్పురా గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో జోనల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన ఆగంతకులు కత్తులతో దాడిచేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 35 ఏళ్ల ఎల్లంగౌడ్ అనుచరుడు మరణించాడు.