రూ 3.32 లక్షల కోట్ల బడ్జెట్, కొత్త వరాలు - కేటాయింపులు..!!
ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం లో సాగిన పాలన పైన విమర్శలు చేసారు. రాష్ట్ర విభజన ఒక నష్టం అయితే... ఆ తరువాత అయిదేళ్లు పాలన రాష్ట్రానికి నష్టం చేసిందని ఆరోపించారు. ఈ బడ్జెట్ కేవలం పద్దులే కాదని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు. అభివృద్ధి- సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలనేదే తమ విధానమని స్పష్టం చేసారు.
రాష్ట్ర బడ్జెట్ 2026-27 ను ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రానున్న ఆర్దిక సంవత్సరానికి రూ 3,32,205 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం తో ఈ బడ్జెట్ ప్రతిపాదించినట్లు వెల్లడించారు. రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేలా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పెట్టుబడి దారులకు అనుకూల వాతావరణం కల్పించామని ఆర్దిక మంత్రి వివరించారు. కీలక రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు. రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు గా పేర్కొన్నారు.

రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు..ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు గా అంచనాల్లో వెల్లడించారు. ఇక, శాఖల వారీగా.. వ్యవసాయ శాఖ కు రూ 11,745 కోట్లు, పాఠశాల విద్య కు రూ 32, 208, బీసీ సంక్షేమం రూ 23650 కోట్లు, ఇంధన శాఖ- 19,306 కోట్లు, పంచాయితీ రాజ్ కు రూ 22,941 కోట్లు, ఇరిగేషన్ 18,223 కోట్ల మేర కేటాయింపులు ప్రతిపాదించారు. అన్నదాత సుఖీభవ కోసం రూ 6,600 కోట్లు, మత్స్యకార సేవకు 600 కోట్లు, ధరల స్థిరీకరణ కు రూ 560 కోట్లు కేటాయింపులు చేసారు.
మౌలిక వసతులకు ప్రాధాన్యత
విద్య, వైద్యం, మౌలిక వసతులకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. తల్లికి వందనం కోసం రూ 9,600 కోట్లు ప్రతిపాదించారు. విద్యా మిత్ర కోసం రూ 654 కోట్లు కేటాయించారు. పోలవరం కోసం రూ 6,105 కోట్లు ప్రతిపాదన చేసారు. మున్సిపల్ శాఖకు 14,358 కోట్లు, EWS సంక్షేమం కోసం 10,699 కోట్లు అమరావతి కోసం ఆరు వేల కోట్లు, ఉన్నత విద్య కోసం రూ 2,566 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ 4,581 కోట్లు ప్రతిపాదించారు.
మన బడి- మన భవిష్యత్ కోసం రూ 155 కోట్లు ప్రతిపాదించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ 2,161 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ 1,232 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు రూ 11, 118 కోట్లు, స్కాలర్ షిప్ కోసం రూ 3,836 కోట్లు ప్రతిపాదించారు. రూ 30 వేల కోట్లతో హార్టీకల్చర్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications