Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడు తారకరత్న వర్ధంతి -సాయిరెడ్డి ఎమోషనల్ ట్వీట్..!

టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న (nandamuri taraka ratna) మూడో వర్ధంతి నేడు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పానికి వచ్చిన నందమూరి తారకరత్న 2013 ఫిబ్రవరి 18న తీవ్ర గుండెపోటుకు గురై ఆస్పత్రికి తరలించే సరికి చనిపోయారు. ఆ తర్వాత ఆయన కుటుంబానికి దగ్గర బంధువైన అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai Reddy)ఆస్పత్రిలో తారకరత్న కుటుంబాన్ని ఓదారుస్తూ కనిపించారు. అప్పుడే సాయిరెడ్డి-తారకత్న బంధువులన్న సంగతి అందరికీ తెలిసింది.

అయితే ఇవాళ తారకరత్న మూడో వర్థంతి సందర్భంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆయన్ను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇందులో నందమూరి తారక రత్న మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. చాలా త్వరగా ఆయన మన మధ్య నుండి వెళ్ళిపోయారు, ఆయన చాలా మంది జీవితాలను తాకిన ఆప్యాయత, వినయం మరియు అంకితభావం యొక్క జ్ఞాపకాలను మిగిల్చారని గుర్తుచేశారు.

vijayasai reddy s emotional tweet on nandamuri taraka ratna s death anniversary

తారకరత్న మరణం కలిగించిన షాక్, లోతైన విచారం, ఆయనను అభిమానించే వారి హృదయాలలో మిగిల్చిన నిశ్శబ్దం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని సాయిరెడ్డి తెలిపారు. ఆయనను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటామని, ప్రేమగా గుర్తుంచుకుంటామని సాయిరెడ్డి తన ట్వీట్ ను ముగించారు. తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఏకైక కుమారుడు. తారకరత్నకు ఒకేసారి 9 సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరల్డ్ రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. 39 ఏళ్ల వయస్సులోనే ఆయన గుండెపోటుతో చనిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+