ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కప్ప నోట్లో త్రాచుపాము, మింగేందుకు ప్రయత్నాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Frog tryies to eat Cobra
ఖమ్మం: ఓ కప్ప త్రాచుపామును మింగిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. జిల్లాలోని విఆర్‌ పురం మండలం ఒడ్డుగూడెం కాలనీలో బుధవారం ఈ అరుదైన సంఘటన జరిగింది. సాయిబాబా గుడి వద్ద గల డ్రైనేజీలో ఓ పెద్ద కప్ప ఓ త్రాచుపామును మెడ వరకు మింగి ఇంకా మింగేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో ఆ పాము కాస్తంత పక్కకు జరిగి పడగ విప్పి కాటేస్తున్న సంఘటన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంది. ఈ వింతను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజల అలికిడికి భయపడిన కప్ప డ్రైజేజీ లోపలికి వెళ్లిపోయింది.

కాగా, అనంతపురం జిల్లాలో ఓ భారీ అనకొండ గొర్రెను మింగిన సంఘటన జరిగిన విషయం తెలిసిందే. పుట్టపర్తి మండలంలోని రాచువారిపల్లి సమీపంలో ఆదివారం కనుమకొండ సమీపంలో కొండ చిలువ గొర్రె పిల్లను మింగేసింది. గ్రామస్థులు కనుగొని కొండచిలువను అటవీ అధికారులకు అప్పగించారు.

గ్రామానికి చెందిన కేశవయ్య గొర్రెలను మేపేందుకు కనుమ కొండకు వెళ్లగా అక్కడ కొండ చిలువ గొర్రె పిల్లను మింగేసింది. కాపరుల ద్వారా సమాచారం తెలియడంతో కొండ చిలువను చూడడానికి గ్రామస్థులు భారీ సంఖ్యలో కనుమకొండకు చేరుకున్నారు. ఈ కొండ చిలువ పదిహేను అడుగులు ఉంది. గొర్రెను మింగిన కొండ చిలువ ఎటు కదలలేకపోయింది.

దీంతో గ్రామస్థులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పారు. పెనుకొండ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారికి విషయం తెలపడంతో ఆయన సోమందేపల్లి బీట్ ఆఫీసర్ రామకృష్ణ, సబ్ బీట్ ఆఫీసర్ వెంకటేశులులను సంఘటనా స్థలానికి పంపించారు. వారు ఆ కొండ చిలువను గోనె సంచిలో బంధించి అడవిలో వదిలి పెట్టారు.

English summary
A frog tryied to eat a cobra snake on Wednesday in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X