కేసులు: కోర్టులకు హాజరైన జగన్, గాలి జనార్దన్ రెడ్డి
హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు విచారణకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోమవారంనాడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ నిమిత్తం ఆయన తన సోదరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి కోర్టుకు వచ్చారు.
ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు. నిందితులను విచారించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణకు సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు నాంపల్లిలో ఈడీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్పై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జగన్తో పాటు ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పా్టీ ప్రధాన కార్యదర్శి, జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి సెప్టెంబర్ 14కు వాయిదా వేశారు.
More From
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications