వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల మద్య గ్యాంగ్ వార్, రాళ్ళు రువ్విన విద్యార్థులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

పెనమలూరు: కృష్ణా జిల్లాలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ గురువారం నాడు చోటు చేసుకొంది. విద్యార్థులు పరస్పరం రాళ్ళదాడి చేసుకొన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ దాడులు చోటు చేసుకొన్నాయి.

పెనమలూరులో విద్యార్థుల గ్యాంగ్‌ వార్ జరిగింది. కర్రలు, రాళ్ళతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో లో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై విద్యార్థులు కర్రలతో దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు.

Gang War between students in Penamaluru

పెనమలూరు పోలీస్‌స్టేషన్ ఎదురుగానే ఈ బీభత్సకాండ జరిగింది. విద్యార్థులు రాళ్ళు రువ్వుతుండటంతో స్టేషన్ నుంచి పోలీసులు బయటకురాలేకపోయారు. స్థానికులు భయంతో తలుపులు వేసుకున్నారు. ఓ ప్రైవేట్ హాస్టల్‌కు చెందిన విద్యార్థుల మధ్య విభేదాలే దాడికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం రాళ్ళు రువ్వుకొన్నారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Gang War between students at Penamaluru in Krishna district on Thursday evening. Stone Pelting Between Students near Penamaluru Police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X