విద్యార్థుల మద్య గ్యాంగ్ వార్, రాళ్ళు రువ్విన విద్యార్థులు
పెనమలూరు: కృష్ణా జిల్లాలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ గురువారం నాడు చోటు చేసుకొంది. విద్యార్థులు పరస్పరం రాళ్ళదాడి చేసుకొన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ దాడులు చోటు చేసుకొన్నాయి.
పెనమలూరులో విద్యార్థుల గ్యాంగ్ వార్ జరిగింది. కర్రలు, రాళ్ళతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో లో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై విద్యార్థులు కర్రలతో దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు.
పెనమలూరు పోలీస్స్టేషన్ ఎదురుగానే ఈ బీభత్సకాండ జరిగింది. విద్యార్థులు రాళ్ళు రువ్వుతుండటంతో స్టేషన్ నుంచి పోలీసులు బయటకురాలేకపోయారు. స్థానికులు భయంతో తలుపులు వేసుకున్నారు. ఓ ప్రైవేట్ హాస్టల్కు చెందిన విద్యార్థుల మధ్య విభేదాలే దాడికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం రాళ్ళు రువ్వుకొన్నారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.