దారుణం: ఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కళాశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆ విద్యార్థినిపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో, పోలీసులు అప్రమత్తమై నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. ఆటోడ్రైవరును అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో తలకొండపల్లిలో ఉద్రిక్తత
మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లిలో ఔషధ సంస్థ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జాయింట్ కలెక్టర్ శర్మణ్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. శిబిరాన్ని కూల్చేశారు. అధికారులపై గ్రామస్థులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రంగురాళ్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
చార్మినార్ సమీపంలో రంగురాళ్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్ట పోలీసులు ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.30 లక్షల విలువైన వజ్రాలు, రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు.