'మా ఊరి పేరులో వాస్తు దోషం ఉంది... మార్చండి'
విశాఖపట్నం: తమ ఊరి పేరులో వాస్తు దోషం ఉందని, వెంటనే పేరు మార్చాలంటూ గోకులపాడు గ్రామస్ధులు కోరుతున్నారు. వాస్తు దోషంగా కారణంగా ఊర్లో ప్రజలు వరుసగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకీ ఎక్కడుందీ ఆ ఊరు, పేరేమిటి అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలోని ఎస్. రాయవరం మండలంలోని గోకులపాడు అనే ఊరు ఉంది. రెండు రోజులు క్రితం ఈ ఊరికి సమీపంలోనే ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, పలువురికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇచ్చింది. పాయకరావు పేట ఎమ్మెల్యే అనితి మంగళవారం బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన గ్రామస్ధులు, తమ ఊరి పేరులో దోషం ఉందని, వెంటనే పేరు మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఊరిలో కూడా గత వారంలో పేలుడు ఘటన జరిగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇలా వరుసగా గ్రామంలో పలువురు మరణిస్తుండటంతో గోకులపాడు గ్రామస్ధులు తమ ఊరి పేరుని మార్చాలని అంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications