జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్- 7 నెలల్లో రూ.40361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు..
ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం లేదని, సంస్ధలు రావడం లేదని, పెట్టుబడులు పెట్టడం లేదన్న విపక్షాల విమర్శలకు చెక్ పడింది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. తాజాగా గత ఏడునెలల్లోనే భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినట్లు నివేదికలు చెప్తున్నాయి.
ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల సంఖ్య అక్షరాలా రూ.40361 కోట్లు. ఈ మొత్తం పెట్టుబడులు కూడా గత 7నెలల్లోనే రాష్ట్రానికి తరలివచ్చాయి. దీంతో భారతదేశానికి పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తోంది. 2022 సంవత్సరానికి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్ గా నిలిచింది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే రూ. 40,361 కోట్ల పెట్టుబడులు రావడంతో ఏకంగా దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్ధానంలో నిలిచింది.

ఇక్కడ మరోవిశేషం కూడా ఉంది. ఈ ఏడాది దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం ఏపీతో పాటు ఒడిశా సాధించాయి. గత ఏడునెలల్లో ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలను డీపీఐఐటీ తాజా నివేదిక వెల్లడించింది.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) నివేదిక ప్రకారం భారత్ కు రూ. 1,71,285 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.భారతదేశ పారిశ్రామిక పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ రూ. 40,361 కోట్లు ఆకర్షించి అగ్రస్థానంలో నిలవగా, ఒడిశా రూ.36, 828 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏపీ క్యాబినెట్ ఇప్పటికే ఇతర రంగాల్లో ఎస్ఐపీబీ ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ.1,26,748 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ పెట్టుబడులతో 40,330 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించునుంది.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
Verse Innovation:లాభాల బాటలో వెర్స్ ఇన్నోవేషన్ - త్వరలో IPO..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications