'తల్లికి వందనం'పై చంద్రబాబు శుభవార్త ... అకౌంట్లోకి రూ.15వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తల్లిక వందనం పథకానికి సంబంధించి రూ.6487 కోట్లు కేటాయించారు. దీనికింద ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ.15వేల చొప్పున అందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు.
కుటుంబంలో ఎంతమంది ఉన్నా సాయం
జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమ్మ ఒడి పేరుతో అమలు చేసింది. తాజాగా తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏడాదికి రూ.15వేల చొప్పున విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వీటిని జమ చేస్తారు. గత ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులన్నా ఒక్క విద్యార్థికి మాత్రమే సాయం అందుతుంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. విదివిధానాలు రాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వీటిని జమచేయనున్నారు.

నైపుణ్యం పెంచేందుకు రూ.కోట్ల ఖర్చు
రాష్ట్రంలో చదువుకున్న యువత నైపుణ్యం పెంచేందుకు, వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు, సాంకేతిక విద్యకు సంబంధించి రూ.1235 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం కంటే అదనంగా రూ.1527 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి జన్ వికాస్ కింద వసతి గృహాలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మానవ వనరుల అభివృద్ధి శాఖ సమగ్రమైన నివేదికను రూపొందించింది. ఎక్కడెక్కడ ఏయే తరహా కళాశాలలు అవసరమవుతాయి? ఎక్కడ ఉపాధి అవకాశాలున్నాయి? తదితర విషయాలతోపాటు చదువుకునే సమయంలోనే నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేలా నిబంధనలు రూపొందించబోతున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా విద్యార్థులు ఎక్కడా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి!












Click it and Unblock the Notifications