వరంగల్ చిన్నోడికి గూగూల్ జీతం రూ.1.10 కోట్లు
వరంగల్: గూగుల్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో కోనాపురం గ్రామానికి చెందిన ఎడ్ల బక్కారెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమారుడు శ్రావణ్రెడ్డి ఎంపికయ్యాడు. స్విట్జర్లాండ్లోని జూరిక్ పట్టణంలో గల సంస్థ కార్యాలయంలో ఈనెల ఒకటిన విధుల్లో చేరాడు. అతను నర్సంపేటలోని సెయింట్ మేరీ పాఠశాలలో 2000 సంవత్సరంలో 2వ తరగతి చదివాడు.
ఆయన తండ్రికి విప్రో కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా ఉద్యోగం రావడంతో బెంగళూర్ వెళ్లామని చెప్పాడు. అక్కడే ఇంటర్ పూర్తి చేసి, 2014 వరకు సూరత్లోని నిట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చేశానని తెలిపాడు. జనవరి నుంచి మార్చి వరకు పదివూర్లు గూగుల్ కంపెనీ వారు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో భారతదేశం నుంచి 43 మందిని ఎంపిక చేయగా.. చెన్నారావుపేట మండలం కోనాపురం నుంచి తాను ఎంపికయ్యానని తెలిపాడు.

ఏడాదికి రూ.79.80లక్షల వేతనం, ఇతర అలవెన్స్లతో కలిపి రూ.కోటి 10లక్షల వేతనం సంస్థ అందిస్తుంది. శ్రావణ్రెడ్డి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు బక్కారెడ్డి, కవిత, తాతయ్య, అమ్మమ్మలు రాధా రపు సాంబరెడ్డి, విజయ, ఎడ్ల రంగారెడ్డి, కౌసల్య హర్షం వ్యక్తం చేశారు.
శ్రావణ్ రెడ్డికి నెలకు రూ.9.16 లక్షల జీతం లభిస్తుంది. అంతకు ముందు ఆయన సూరత్లోని నిట్లో చదివాడు. అక్కడే అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద యెత్తున అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు.












Click it and Unblock the Notifications