నాశనం, ముగ్గురు మోడీలు దోచుకుంటున్నారు: ప్రధానిపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాఫెల్ యుద్ధ విమానాలలో మోడీ అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో బోఫోర్స్ కుంభకోణం ద్వారా కాంగ్రెస్ పార్టీ రూ.16 వేల కోట్ల అవినీతికి పాల్పడితే రాఫెల్ కుంభకోణం ద్వారా బీజేపీ రూ.30 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థను మోడీ సర్వనాశనం చేశారన్నారు. బీజేపీ నేతలే అతి పెద్ద దోపిడీదారులన్నారు. పెట్రోల్ ధరలను ప్రతి రోజూ సమీక్షించుకునే విధానం ద్వారా కేంద్ర ఖజానాకు లక్షల కోట్లను జమ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ నుంచి పన్నుల రూపంలో ఎంతో పోగేసుకుంటున్న కేంద్రం తిరిగి ఏపీకి ఏం ఇస్తోందో చెప్పాలన్నారు.

గుజరాత్ లో చోటు చేసుకున్న అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకే అన్నాడీఎంకే ఎంపీలతో లోకసభలో బీజేపీ ఆందోళన చేయిస్తోందన్నారు. ముగ్గురు మోడీలు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications