వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ పేరు: శంషాబాద్‍‌పై అశోక్, తప్పులేదని వెంకయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో చెప్పిన మరుసటి రోజే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు ఆ దిశలో అడుగులు వేస్తామని ప్రకటన చేశారు. శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడతామని అశోక చెప్పారు. ఆ డిమాండులో ఎలాంటి తప్పులేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మద్దతు పలకడం గమనార్హం.

హైదరాబాద్‌లోని శంషాబాద్ దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా పేరు మార్చిందని, ఇప్పుడు దానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని అశోక్ గజపతి రాజు గురువారం స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన తన శాఖ బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉండేదని, దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చాలని నిర్ణయించినప్పుడు, మార్చొద్దని ఆందోళన చేసిన వారిలో తానూ ఒకడినని అయితే, తానే పౌరవిమానయాన శాఖ మంత్రినవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.

Government mulls renaming Hyderabad’s RGIA after NTR

ఇప్పుడు దేశీయ విమానాశ్రయానికి పేరు మార్చే అవకాశం వచ్చినందున కచ్చితంగా ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణతోసహా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.

హైదరాబాద్ విమానాశ్రయం పేరును ఎన్టీఆర్ నుంచి రాజీవ్ గాంధీకి మార్చినప్పుడు తాము వ్యతిరేకించామని, ఎన్టీఆర్ పేరును అలాగే ఉంచాలని డిమాండ్ చేశామని, గతంలో చేసిన డిమాండును నెరవేర్చుకునే అవకాశం వచ్చినందున సహజంగానే ఎవరైనా దానిని పూర్తి చేసుకుంటారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ విమర్శలను తాను పట్టించుకోనని, ఎన్టీఆర్ పేరు ఉండాలని తెలుగువారు కోరుకుంటున్నారని చెప్పారు. తాము కొత్త పేరు పెట్టడం లేదని, ఉన్న పేరును పాత ప్రభుత్వం మార్చడం వల్లే ఇప్పుడు సమస్య వచ్చిందన్నారు.

వెంకయ్య మద్దతు

హైదరాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరే ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆ నామకరణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో తాను కూడా ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన యూపిఏ ప్రభుత్వం దానిని మార్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, దానిపై చర్చించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

English summary

 "I was one among the people, who was present when it was named after the great N T Rama Rao earlier. It was changed subsequently. Some people are suggesting you change it back. That is an issue that will be decided in due course of time. That is not urgent today," BJP leader and parliamentary affairs minister Venkaiah Naidu told reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X