విశాఖ లా విద్యార్థినిపై రేప్: 'మత్తులో ఉన్నా, ఏం చేశానో తెలియదు'
విశాఖ: రెండు రోజుల క్రితం రాత్రి మద్యం మత్తులో లా విద్యార్థిని పైన అత్యాచారం చేసిన రిషబ్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ... మొన్న రాత్రి ఏం జరిగిందో తనకు తెలియదని, పూర్తిగా మద్యం మత్తులో ఉన్నానని, తాను అమాయకుడినని చెప్పారు.
రిషబ్ను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఏమీ తెలియదని చెప్పాడు. వర్క్ విషయమై వారి గదికి వెళ్లిన క్రమంలో అంతా కలిసి మందు తీసుకున్నామని చెప్పాడు.
అయితే, తాను మాత్రం మద్యం మత్తులో ఉండటం వల్ల ఏం తెలియదని చెప్పాడు. పోలీసు స్టేషన్కు వచ్చేంత వరకు తనకు అసలు ఏం తెలియదని చెప్పాడు.
కాగా, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అదే యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
లా యూనివర్శిటీలో చదువుతున్న బీహార్కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంవిపి కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బుధవారం రాత్రి తమ గదిలో ఈ అమ్మాయిలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో ఆ యూనివర్శిటీలోనే నాలుగో సంవత్సరం చదువుతున్న రిసిబ్ సింగ్ అనే సీనియర్ విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేందుకు వీరి గదికి వచ్చాడు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది.