IIIT: ట్రిపుల్ ఐటీలపై తేల్చేసిన లోకేష్..! అదే క్యాంపస్ లో..!
ఏపీలో ట్రిపుల్ ఐటీల్లో (IIIT) చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. ఓవైపు రెగ్యులర్ వీసీ లేక ఒరిజినల్ డిగ్రీ సర్ఠిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్ధులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత సదుపాయాలు లేక విద్యార్ధులు బయటికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులపై ఇవాళ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు
రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత సదుపాయాలకు అవసరమైన నిధుల కోసం ఆర్థికశాఖ మంత్రితో మాట్లాడామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కొత్తగా సాస్కీ స్కీమ్ తీసుకొచ్చిందని, డీపీఆర్ లు తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కొంత నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో నూజివీడు క్యాంపస్ లో శాశ్వత సదుపాయాల కల్పనకు రూ.60కోట్లు, అరకు వ్యాలీలో రూ.40 కోట్లు, ఒంగోలు క్యాంపస్ కు రెండు విడతలకు కలిపి రూ.600 కోట్లు, శ్రీకాకుళం క్యాంపస్ కు రూ.300 కోట్లు అవసరమని లోకేష్ తెలిపారు.

అలాగే పుట్టపర్తిలో కొత్తగా ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు గల అవకాశాలపై ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏ జిల్లాలో ట్రిపుల్ ఐటీ చదివే పిల్లలు అక్కడే పూర్తిచేయాలన్నది తమ ఆలోచన అని లోకేష్ తెలిపారు. తాత్కాలిక అకాడమీ కోసం వేర్వేరు జిల్లాలకు పంపాల్సి వస్తోందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి శాశ్వత సౌకర్యాలను కల్పించి,, ఏ క్యాంపస్ లో పిల్లలు చేరారో అదే క్యాంపస్ లో కోర్సు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications