రివర్స్ టెండరింగ్ రియాల్టీ షోనా ? దేవినేని ఉమా కొవ్వు పట్టి మాట్లాడుతున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో టిడిపి నేతలు పలు విమర్శలను చేస్తున్నారు. పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒకే కాంట్రాక్టర్ కు దక్కాయని వెలిగొండ పనుల టెండరింగ్ లో రియాలిటీ షో జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన రివర్స్ టెండరింగ్ ను రియాల్టీ షో అని దేవినేని ఉమ విమర్శిస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుపై అది చేసాం ఇది చేశాం అంటూ గ్రాఫిక్స్ చూపించుకున్నారే తప్ప ఏ ఒక్కపనీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైన దేవినేని వేల కోట్ల రూపాయలను దోచుకుని తిన్నారని ఆరోపణలు గుప్పించారు. దేవినేని ఉమా కొవ్వు పట్టిన మాటలు ఈరోజు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఒక నెలలోనే రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం ఆదా చేసిన మాటను దేవినేని ఉమమర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు.

ఇక అంతే కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రోజు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని శ్రీకాంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్ కేసును మాఫీ చేయించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాడని టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జగన్ అందుకోసం ఢిల్లీకి వెళితే, మరి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లింది జగన్ పై కేసులు బనాయించటానికి కోరడానికి కదా అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఒకరిని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తూ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications