వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్ట్ తల నరికి యూట్యూబ్‌లో, అమెరికాకి హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అమెరికాకు చెందిన ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తల నరికి, ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఎ మెసేజ్ టు అమెరికా అనే పేరుతో పెట్టిన ఆ వీడియోలో తమ అదుపులో మరో జర్నలిస్ట్ ఉన్నాడని సదరు తీవ్రవాద సంస్థ తెలిపింది. అమెరికా స్పందనను బట్టి అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపింది.

కాగా, ఉగ్రవాదుల చేతిలో బలైనతను 2012 నవంబర్ 22న కిడ్నాప్‌కు గురైన జేమ్స్ ఫోలీగా గుర్తించారు. మరో జర్నలిస్టు గతేడాది సిరియాలో కనిపించకుండా పోయిన స్టీవెన్ సాట్లాఫ్ అని తెలుస్తోంది. ఇరాక్‌లో అమెరికా చర్యలకు ప్రతిగానే జర్నలిస్టులను చంపినట్టు వీడియో వెల్లడిస్తోంది.

Islamic State insurgents released a video

సోషల్ మీడియాలో పోస్టయిన ఈ వీడియోను తాము పరిశీలించామని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి కైట్లిన్ హేడెన్ తెలిపారు. జర్నలిస్టు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

ఒక ఏడారి లాంటి ప్రాంతంలో జర్నలిస్ట్ జేమ్స్ పోలీని మోకాళ్ల మీద నిలబెట్టి పక్కనే నల్లని దుస్తుల్లో ముసుగు ధరించి ఆయుధంతో నిలబడ్డ తీవ్రవాదిని వీడియోలో చిత్రీకరించారు. మంగళవారం అప్ లోడ్ చేసిన ఈ వీడియోను తక్కువ సమయంలో ఎక్కువమంది చూశారు. ఆ తర్వాత దీనిని తొలగించారు. వీడియో నిజమైనదేనా, ఎవరు పెట్టారు తదితర విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది.

English summary
Islamic State insurgents released a video on Tuesday purportedly showing the beheading of US journalist James Foley, who had gone missing in Syria nearly two years ago, and images of another US journalist whose life they said depended on US action in Iraq. The video, titled "A Message To America," was posted on social media websites. It was not immediately possible to verify its authenticity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X