‘ఇదంతా ఓ రిహార్సల్..’, టీడీపీ తెగదెంపులుపై కేంద్ర మంత్రి నక్వీ సంచలనం
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకోవడంపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు పార్లమెంట్లో జరిగే ఓ రిహార్సల్ వంటిదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
'చూద్దాం.. పార్లమెంట్లో ఏం జరుగుతుందో, ఏ పార్టీ ఏ దారిలో వెళుతుందో..' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతీ రాష్ట్రం కొన్ని సమస్యలను, డిమాండ్లను కేంద్రం ముందుంచడం సహజమేనని.. వాటి గురించి తాను వ్యాఖ్యానించబోనని నక్వీ చెప్పారు.

ఎన్నికలు వచ్చే తరుణంలో ఇలా జరగడం కొత్తేమీ కాదని, ఇది సంప్రదాయమేనని కేంద్ర మంత్రి నక్వీ అన్నారు. ఎన్నికల ముందు ఇదంతా పార్లమెంట్లో జరిగే ఓ రిహార్సల్ వంటిదంటూ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యాక తన విధానం ఏమిటన్నది బీజేపీ ప్రకటిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications