దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆ ఆలయాలకు రూ.813 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఆధ్యాత్మికత చేర్చేలా దేవాదాయ శాఖ ప్లాన్ చేసింది . రూ.813 కోట్లు సర్వ శ్రేయ నిధి నుండి ఖర్చు చేస్తున్నామని, 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణం చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, గత రెండు సంవత్సరాల్లో దేవాదాయ శాఖ సాధించిన విజయాలను వివరించారు.

దేవాదాయశాఖ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్

ఈ సందర్భంగా దేవాదాయశాఖ రెండేళ్ల పనితీరు నివేదికను అధికారికంగా విడుదల చేశారు. గత ప్రభుత్వ కాలంలో దేవాలయాలు, హిందూ దేవుళ్లకు కూడా భద్రత లేని వాతావరణం నెలకొని ఉండేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే తిరుమల నుంచి దేవాదాయ శాఖలో ప్రక్షాళన ప్రారంభమైందని, పవిత్ర స్థలాలను సామాన్య భక్తులకు సులభంగా అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

Good news on ap temples Minister Anam Ramanarayana Reddy released progress report of Endowment Dept

ప్రతి ఇంటికీ ఆధ్యాత్మికత చేర్చే లక్ష్యంతో దేవాదాయ శాఖ

సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఇంటికీ ఆధ్యాత్మికత చేర్చే లక్ష్యంతో శాఖ పని చేస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం దేవాలయాలను సమాజంలో భాగంగా గుర్తించకుండా విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. రామతీర్థం, దుర్గగుడి వెండి సింహాలు, అంతర్వేది రథం వంటి ఘటనలపై వైఎస్సార్‌సీపీకి పశ్చాత్తాపం లేదని విమర్శించారు. గత పాలకులు రైతుల భూములను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చి, 22ఏ సెక్షన్ కిందకు చేర్చి కక్ష సాధింపు చేశారని చెప్పారు.

1,200కు పైగా భజన మందిరాలు

ఇలాంటి సుమారు 2,000 కేసులు దృష్టికి వచ్చాయని, లెక్కల ప్రకారం 6.50 లక్షల ఎకరాలు అదనంగా దేవాదాయ శాఖకు వచ్చాయని తెలిపారు. నష్టపోయిన బాధితులు ఆధారాలతో వస్తే NOC ఇస్తామని హామీ ఇచ్చారు. ధార్మిక పరిషత్ ద్వారా శ్రీవాణి నిధులతో 1,200కు పైగా భజన మందిరాలు వివిధ ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్నామన్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు నచ్చిన దేవుళ్ల మందిరాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దేవాదాయ భూ రికార్డుల డిజిటలైజేషన్ మరియు సంరక్షణ చేపట్టామన్నారు.

మరో 65 ఆలయాల్లో అన్నప్రసాదం అందించే ప్లాన్

రానున్న రోజుల్లో మరో 65 ఆలయాల్లో అన్నప్రసాదం కార్యక్రమం విస్తరణ జరిగిందన్నారు. అన్నప్రసాదం కోసం ప్రతి సంవత్సరం రూ.84 కోట్లు ఖర్చు చేస్తూ సుమారు 3 కోట్ల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖలోకి విలీనం చేశామని, అన్ని దేవాలయాలను డిజిటలైజ్ చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. వాడపల్లిలో భూమి లేని సందర్భంలో దాతలు ముందుకొస్తే అభివృద్ధి చేస్తామన్నారు.

విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు!
విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు!

షిర్డీ సాయి ఆలయాలపై మంత్రి ప్రకటన

దుర్గమ్మ ఆలయంలో నకిలీ టికెట్ల గురించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారమే ఆలయాల నిర్మాణం జరుగుతోందని, శిర్డీ సాయి ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి రావని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. హిందువుల ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక విలువలను కాపాడుతూ శాఖ ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+