మెదక్ నుంచి జైపాల్ రెడ్డి పోటీ: అధిష్టానం యోచన

గజ్వెల్ శాసనసభా స్థానాన్ని ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెదక్ లోకసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మెదక్ లోకసభ స్థానం ఖాళీ అయి, ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మెదక్ లోకసభ సీటు కోసం మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి, మాజీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ తదితర నేతలు పోటీ పడుతున్నారు.
ఇదిలావుంటే, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్కు వచ్చారు. వ్యక్తిగత పనులపై వచ్చిన ఆయనను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రోటోకాల్ విభాగం నేత వేణుగోపాల్ తదితర నేతలు కలిశారు.
కాగా, సోదరుని మరణంతో విషాదంలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రెసు నాయకులు కుంతియా, పొన్నాల లక్ష్మయ్య కలిసి పరామర్శించారు.












Click it and Unblock the Notifications