మీరు అలా చిచ్చు పెట్టొచ్చా, తిరుగుబాటు: బీజేపీపై పవన్ కళ్యాణ్ తీవ్రవ్యాఖ్య
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు బీజేపీ పైన తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తరాది - దక్షిణాది అంటూ విభజన రాజకీయం చేయవద్దన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు బీజేపీ పైన తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తరాది - దక్షిణాది అంటూ విభజన రాజకీయం చేయవద్దన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు కౌంటర్ ఇచ్చారు.
ఎదుగు.. కానీ ఓపిక పట్టు: పవన్ 'రెండు' ప్రశ్నలకి వెంకయ్య ధీటైన జవాబు
మతాల ఆధారంగా విభజిస్తే పరవాలేదా అని నిలదీశారు. తద్వారా నేను దక్షిణాది - ఉత్తరాది అని మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయన్నారు. తెలివితేటలు కేవలం నార్త్ బ్లాక్లో ఉన్న వారికే పరిమితం కాదన్నారు.
వైసిపితో పాటు ఏ పార్టీతోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో తనకు బీజేపీ మాత్రమే ఛాయిస్గా ఉందని, కాబట్టి బీజేపీకి ఓటేయమని చెప్పానని, హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తానని కూడా చెప్పానని గుర్తు చేశారు.
త్వరలో ఈశాన్య రాష్ట్రాలకు కూడా హోదా ఉండదన్న బీజేపీ వ్యాఖ్యల పైన కూడా పవన్ స్పందించారు. హోదా పోయినా, ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు హోదా గురించి తెలుసుకున్నానని చెప్పారు.
మొండివాళ్లు రాజుకైనా బలవంతులు అన్నట్లుగా మన నేతల వైఖరి ఉందని విమర్శించారు. వారు మొండితనం చూపిస్తే ప్రజలు చూపిస్తారన్నారు. వాళ్లు తెచ్చిన చట్టాలనే పాటించరా అని నిలదీశారు. తెలంగాణ అంశాన్ని 17 ఏళ్లు నాన్చి, కేవలం 12 గంటల్లో తేల్చేశారన్నారు. హోదా ఇవ్వననడం దేనికి నిదర్శనం అన్నారు. తాను లెఫ్ట్ కాదు.. రైట్ కాదని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు.
{photo-feature}