టీతో గెలుద్దామని.. ఓడాం: జీవన్‌రెడ్డి, చానళ్లపై వెంకయ్య

Jeevan Reddy interesting comments
హైదరాబాద్: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలించకుండా తెలంగాణతోనే గెలుద్దామని అనుకున్నామని కానీ, ఓడిపోయామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు చేస్తే ఆర్థిక భారం పడుతుందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటే పాఠశాల అని చెప్పడం సరికాదన్నారు. పేదలకు ఆంగ్ల విద్య అమలుతో పాటు ప్రయివేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు వచ్చేలా చూడాలన్నారు.

సిగ్గుతో తలదించుకుంటున్నా: విహెచ్

తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలతో సిగ్గుతో తల దించుకుంటున్నానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని స్థాయుల్లో ప్రక్షాళన జరగాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరిన నేతలపై వీహెచ్ మండిపడ్డారు. పార్టీలో ఉండి పదవులన్నీ అనుభవించిన తర్వాత ఇంకో పార్టీలోకి మారడం దారుణమన్నారు.

టీవీ ఛానళ్ల బ్యాన్‌పై వెంకయ్య

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ఛానళ్ల ప్రసారాలను తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేయడాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఛానళ్ల నిలిపివేత నిషేధం అక్రమం, న్యాయ సమ్మతమైనదని కాదన్నారు. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలసి మాట్లాడానని, ఛానళ్లను నిలిపివేతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఎంఎస్‌వోలు ఛానళ్లను వెంటనే పునరిద్ధరించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+