Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ కుతకుత- ఆ జిల్లాలు పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టే

ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం వ‌ల్ల మొన్న‌టివ‌ర‌కు వ‌ర్షాలు ప‌డ్డాయి గానీ ఇప్పుడు ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

Kadapa and Nellore Records Scorching Heat Waves as Hottest Places at 44 Degrees Celsius in season

ఈ రెండు నెలల్లో ఎండ తీవ్రత 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప, నెల్లూరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా పొట్టిపాడులో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక్కడ 44.7 డిగ్రీల సెల్సియస్ మేర ఎండ కాసింది. రాష్ట్రం మొత్తానికీ ఇదే అత్యధికం.

అదే స్థాయిలో నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రెండు జిల్లాల్లో ఆయా ప్రాంతాలు వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. నేడు కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

అలాగే శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, విజయనగరం జిల్లా సంతకవిటి, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సీతంపేట, వీరఘట్టం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మరో 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతుందని అన్నారు.

  • ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపీ లేదా రుమాలు ధరించాలి.
  • తెలుపు రంగు కాటన్ వస్త్రాలు, సన్ గ్లాసెస్ ధరించాలి.
  • మంచినీరు ఎక్కువగా తాగాలి.
  • గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగవద్దు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+