అక్కడ గెలవాలంటే ఏం చేయాలో నాకు తెలుసు: సీఎం జగన్
పూర్తిస్థాయి వేసవికాలం రాకుండానే ఏపీలో వాతావరణం వేడెక్కింది. అయితే అది సాధారణ వాతావరణం కాదు.. రాజకీయ వాతావరణం. ఎన్నికల ప్రకటన రావడమే తరువాయి వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జగరనుంది. యుద్ధానికి సిద్ధమైన ఈ రెండు పార్టీలు అందుకు కావల్సిన 'ఆయుధాలను' సిద్ధం చేసుకుంటున్నాయి. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఆ పార్టీ విశ్వాసాన్ని బలహీనపరిచి ఎలాగైనా తామే గెలుపొందాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ప్రొద్దుటూరు. ప్రస్తుతం ఇక్కడినుంచి వైసీపీ తరఫున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డిపై 45,148 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా రాచమల్లు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిపై 12,945 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మూడోసారి కూడా టికెట్ తనదే అనే ధీమాలో రాచమల్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఇక్కడ ముగ్గురు ప్రధాన నాయకులు పోటీపడుతున్నారు. వారిలో ఎవరికి దక్కుతుందో చూడాలి.

నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కుందాల బాలనారాయణరెడ్డి విజయం సాధించారు. 1955 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున ఆయనే గెలుపొందారు. 1952 నుంచి 1978 వరకు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండుసార్లు గెలిచింది. టీడీపీ ఇక్కడి నుంచి మూడుసార్లు మాత్రమే గెలుపొందగలిగింది. 1994 గాలిలో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. అభ్యర్థులు ఖరారైన తర్వాత రసవత్తర పోరు సాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications