కడప పోలీసు అధికారులకు పండగ, మంత్రికి సలామ్ చేశారని చార్జ్ మెమోలు, ఐపీఎస్ సీరియస్!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ సందర్బంగా జరిగిన గిడవల కారణంగా వైసీపీకి అండగా నిలిచిన అధికారుల మీద వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, చంద్రగిరి సంఘటనపై సీరియస్ అయిన ఈసీ పలు జిల్లాల్లో పోలీసు అధికారులపై వేటు వేసింది. అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసు అధికారులు అందరిపై వేటు వేశారు.
ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గురించి హాట్ టాపిక్ అయ్యింది. కడపలోని గౌస్ నగరలో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అగ్రహం వ్యక్తం. విధుల్లో ఉన్న సీఐతో సహ ఐదు మంది ఎస్ఐ లకు చార్జ్ మెమో జారీ చేశారు. నిర్లక్షంగా విధులు నిర్వహించడం వలనే రాళ్ల దాడులు జరిగిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు ఆలీఖాన్, రఫీ, ఎర్రన్న, తిరుపాల్ నాయక్, రంగస్వామిలకు చార్జ్ మెమోలు పంపించారు. కడపలో ఇంత మంది పోలీసు అధికారులకు చార్జ్ మొమోలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మే 13వ తేదీ కడప నగరంలోని గౌస్ నగర్ లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ సందర్బంలో సామాన్య ప్రజలు సైతం భయంతో పరుగులు తీశారు
గొడవలు జరిగిన తరువాత గౌస్ నగరలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు. రాళ్ల దాడులు జరిగే సమయంలో మంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులు వైసీసీ కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ రాళ్ల దాడిలో అనేక మందికి గాయాలు కావడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. గొడవలకు కారణం అయిన పోలీసుల అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేసిన ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అందిరిని వివరణ కోరారు. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులకు వత్తాసు పలికిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications