వనజాక్షిపై దాడి: బిజెపికీ చెడ్డపేరని కావూరి ఆవేదన, దర్యాఫ్తు వేగం
ఏలూరు: తహసీల్దారు పైన దాడి విషయంలో ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకుంటే భారతీయ జనతా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత కావూరి సాంబశివ రావు శుక్రవారం నాడు అన్నారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదుద్దేశ్యంతో డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్లు ఇస్తే వారిని అడ్డం పెట్టుకొని చింతమనేని కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు.

ఇలాంటి అరాచక శక్తులను చంద్రబాబు ఉపేక్షించొద్దన్నారు. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా చేయాలన్నారు. కట్టడి చేయకుంటే రాజకీయాల్లో నేరశక్తులు పెరిగిపోతాయని హెచ్చరించారు. కాగా వనజాక్షి మీద దాడి ఘటనపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారని ఏపీఎన్జీవోలు చెప్పారు.
వనజాక్షి పైన దాడి కేసు దర్యాఫ్తు వేగవంతం కానుంది. తమ్మిలేరు వాగులో ఇసుక రీచ్ల సరిహద్దులను తేల్చాలని రెవెన్యూ అధికారులకు డీఎస్పీ వెంకటరమణ లేఖ రాశారు. ఈ సంఘటన పైన రంగంపేట గ్రామస్థుల స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications