కోట్లాది రూపాయల కేశవరెడ్డి విద్యాసంస్థల ఆస్తులు జప్తు
విజయవాడ: ఫీజులకు బదులుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డిపాజిట్లు వసూలు చేసి ఆతర్వాత వాటిని తిరిగి చెల్లించలేక చేతులెత్తేసిన కేశవరెడ్డి విద్యా సంస్థల ఆస్తులను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని రూ.12.81కోట్ల విలువైన 17.82ఎకరాల భూమిని జప్తు చేసింది.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. కేశవరెడ్డి విద్యాసంస్థలు చేసిన మోసంపైన 2015 సెప్టెంబరులో కర్నూలు సహా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. వాటిన్నింటిని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

దీనిపైన దర్యాప్తుచేపట్టిన సీఐడీఅధికారులు 10,806 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థల ప్రతినిధులు రూ.270 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్లు లెక్క తేల్చింది. పలువురు ఫైనాన్షియర్లు, బ్యాంకుల నుంచి మరో మరో రూ.277 కోట్లను పొందినట్లు తేల్చింది. ఆ సొమ్ముతో పలుచోట్ల స్థిరాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications