బాబుXకేసీఆర్: కేంద్ర టీంకు ప్లైట్ టిక్కెట్ దొరకలేదట! మత్తయ్య కేసులో కీలక ఆధారాలు
హైదరాబాద్: ఓటుకు నోటు వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన విభేదాలను తగ్గించే క్రమంలో రంగంలోకి దిగిన కేంద్రం చర్యలు ఆలస్యమవుతున్నాయి. తొలుత ఖరారైన షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోంశాఖ సెక్రటరీ అలోక్ కుమార్ గోయల్ బుధవారం హైదరాబాద్ రావాల్సి ఉంది.
అలోక్ కుమార్ హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా, ఇంకా ఢిల్లీలో ఉంటున్న అంశంపై ప్రశ్నించగా.. హైదరాబాదు వెళ్లేందుకు అలోక్ కుమార్ బృందానికి ప్లైట్ టిక్కెట్లు దొరకలేదని చెప్పారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఇంకా ఢిల్లీలోనే ఉన్నారని, హైదరాబాద్ బయలుదేరలేదని సమాచారం. అతను రేపు రావొచ్చని తెలుస్తోంది.
దర్యాఫ్తులో కీలక డాక్యుమెంట్ల సేకరణ!
జెరూసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు పైన సీఐడీ బృందం విచారణ జరుపుతోంది.
మత్తయ్య కేసులో వారు కీలక డాక్యుమెంట్లు సేకరించినట్లుగా తెలుస్తోంది. కేసు విచారణ తీరును చర్చించేందుకు ఎస్పీ కోటేశ్వర రావు అధికారులతో భేటీ అయ్యారు. మత్తయ్య సెల్ ఫోన్ కాల్ లిస్ట్ ద్వారా కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.