అందుకే 'ఎవడు'కు ఆ పేరు: చిరంజీవిపై కిల్లి అభిమానం
హైదరాబాద్/శ్రీకాకుళం: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మరో కేంద్రమంత్రి చిరంజీవి పైన పొగడ్తల వర్షం కురిపించారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన ఎవడుచిత్రం విడుదల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో చిరు అభిమానుల ఆత్మీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృపారాణి పాల్గొని చిరంజీవి పైన, ఆయన కుటుంబం పైన తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు అన్నయ్య చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, ఆయనకు ఎవరు సాటిరారన్నారు. అన్నయ్య స్టెప్పులేస్తే అదిరిపోతుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరు చిరంజీవిని అభిమానిస్తారని చెప్పారు. కష్ట సమయంలో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఆక్సిజన్ అందించారని అభిప్రాయపడ్డారు.
చిరంజీవి ఫ్యామిలీకి ఎవరు సాటిరారని, దానిని చెప్పేందుకే రామ్ చరణ్ తేజ నటించిన తాజా చిత్రానికి 'ఎవడు' అని పేరు పెట్టారని తనదైన శైలిలో చెప్పారు. కిల్లి కృపారాణి మెగాస్టార్ చిరంజీవి పైన తన అభిమానాని చాటుతుంటే అభిమానులు కేరింతలు కొట్టారు.
విభజన పైనా...
అదే సమయంలో కిల్లి కృపారాణి విభజన అంశం పైనా మాట్లాడారు. విభజన విషయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తలో మాట చెబుతున్నారని, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దీనిని చిరంజీవి అభిమానులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications