7 నెలలవుతోన్నా జరగని న్యాయం.. నారా లోకేశ్ను కలిసిన కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్..
ఏపీ సీఎం జగన్పై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. కిరణ్ కుటుంబ సభ్యులు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ను కలిశారు. దీనిపై లోకేశ్ ట్వీట్టర్ లో స్పందించారు. జగన్ పాలనలో దళితులపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు.
మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు కిరణ్ను కొట్టి చంపారని నారా లోకేశ్ ఆరోపించారు. ఏడు నెలలు అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని తెలిపారు. హత్య చేసిన పోలీసులకు శిక్ష పడలేదని ఆయన వివరించారు. వైసీపీ నేత బంధువు అనే కారణంతో ఎస్సైని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదీ సరికాదు అని.. దీనిని దళితుల గుర్తించాలని కోరారు.

కిరణ్కు జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగడానికి వీల్లేదని లోకేశ్ ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత జాతి ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. కిరణ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నారా లోకేశ్ తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.
ఫోటోలు: ఇంటి వద్దకే రేషన్ చేర్చే మొబైల్ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
కిరణ్ అంశం అప్పట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నేతలపై విమర్శలు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ కేసు నమోదు చేసినా.. కొలిక్కి రాలేదు. దీంతో కిరణ్ కుటుంబసభ్యులు ఇవాళ నారా లోకేశ్ను కలిశారు. వారి తరఫున పోరాటం చేస్తామని లోకేశ్ వివరించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications