బాబా రామ్దేవ్ వచ్చినా భూమి ఇస్తాం: గంటా
విజయవాడ/ హైదరాబాద్: ఈషా ఫౌండేషన్ కోసం ఇవ్వబోయే భూములు యోగా, ధ్యాన కేంద్రాల కోసంకాదని, ప్రపంచస్థాయి సంస్థల కోసం ఇచ్చామని, విశాఖలో బ్రహ్మకుమారీలకు కూడా భూములిచ్చామని, ఒకవేళ రా మ్దేవ్బాబా వచ్చినా భూములిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో తెలిపారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం గల వారితో సీఎం ఒక కమిటీ వేశారని, నివేదిక ఆధారంగానే ఎవరికైనా భూములు కేటాయిస్తామన్నారు.
జగ్గీవాసుదేవ్కు చెందిన ఈషా ఫౌండేషన్కు భూ కేటాయింపు చేసే యోచనలో ఉన్నామని, అయితే అవి అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల కేంద్రం నుంచి అనుమతులు రావాలని, ఈ భూములు డీనోటిఫై చేసిన తర్వాతనే ఈషా ఫౌండేషన్కు చెందుతుందని తెలిపారు. ఏదిఏమైనా నిబంధనలకు అనుగుణంగానే భూకేటాయింపులు ఉంటాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భూమి విలువ తెలుసన్నారు.

రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో అంధత్వాన్ని పూర్తిగా నివారించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఇందులో భా గంగా ఎప్పటికప్పుడు విద్యార్ధులకు నేత్రపరీక్షలు నిర్వహించాలని సూచించారు.
గిరిజనప్రాంతాల్లో ప్రతి వారం నేత్ర పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. గురువారం సచివాలయంలో జరిగిన ‘రైట్ టు సైట్ సొసైటీ' సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేత్ర నిధిని ఏర్పాటు చేయడంతోపాటు డయాబెటిక్ రేటినోపతి సెంటర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications