వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకెళ్లిన లారీ: ఇద్దరు గోవిందమాల భక్తుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న గోవిందమాల భక్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ మేరకు మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా పుత్తూరు ఆస్పత్రికి తరలించారు.

Lorry accident: two dead in Tirumala

మృతులను తమిళనాడు రాజధాని చెన్నైవాసులుగా గుర్తించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది.

లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

English summary
Two Govindamala devotees dead in Chittoor district, as a lorry collided
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X