వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దూసుకెళ్లిన లారీ: ఇద్దరు గోవిందమాల భక్తుల మృతి
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న గోవిందమాల భక్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మేరకు మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా పుత్తూరు ఆస్పత్రికి తరలించారు.
మృతులను తమిళనాడు రాజధాని చెన్నైవాసులుగా గుర్తించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది.
లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
English summary
Two Govindamala devotees dead in Chittoor district, as a lorry collided
Story first published: Tuesday, August 5, 2014, 9:12 [IST]